Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
అంతర్జాతీయంరాజకీయం

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. అనుమానమే అవసరం లేదు: నటుడు పృథ్వీరాజ్‌

ఏపీలో జరగబోయే 2024 ఎన్నికలపై నటుడు పృథ్వీరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా జగన్ సర్కార్‌కు బుద్ధి చెబుతారన్నారు.

వచ్చే ఎన్నికలపై జోస్యం చెప్పారు జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్‌. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ పాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. పృథ్వీరాజ్‌ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన కొత్త రంగుల ప్రపంచం సినిమా టీమ్ ఖమ్మం జిల్లా బోనకల్లు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వచ్చే ఎన్నికలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు పృథ్వీ. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రలో దర్శకుడు చెప్పినట్లు నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. బోనకల్‌లో పృథ్వీరాజ్‌‌తో పాటుగా కొత్త రంగుల ప్రపంచం సినిమా యూనిట్ టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వెళ్లారు. హీరోయిన్‌గా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారన్నారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు.

Related posts

భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’.. కోట్ల రూపాయల స్వాహా.. చిక్కారో అంతే సంగతులు.

HJNEWS

పవన్‌ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఆయనకు ఆ ఆలోచనే రావడం లేదు: మంత్రి అమర్

HJNEWS

వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్