Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

గత ఏడాది కాలంలో బెస్ట్ , వరస్ట్ స్టాక్స్ ఇవే.. ఎక్కువ లాభాలు దేనికంటే..?

111 Views

గత పంద్రాసగ్టు నుంచి ఈ ఆగస్టు 15 వరకు స్టాక్ మార్కెట్లు బాగా రాణించాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 25 లక్షల కోట్లు పెరిగింది. మరి గతేడాది కాలంలో బెస్ట్, వరస్ట్ స్టాక్స్ వివరాల కోసం కింది కథనం చదవండి.

ఇవాళ యావత్ దేశం 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో కూడా ఇండిపెండెన్స్ డే ఉత్సాహాన్ని నింపుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే గత పంద్రాగస్టు నుంచి ఈ ఆగస్టు 15 వరకు ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా రాణించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ ఈకాలంలో 10 శాతం వృద్ధి నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.81 శాతం మెరుగుపడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు రూ. 309.09 కోట్లుగా ఉంది. 2022 ఆగస్టు 15 నాటికి ఇది రూ. 275.03 లక్షల కోట్లుగా ఉండేది. అంటే సరిగ్గా ఏడాది కాలంలో బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ కంపెనీల విలువ ఏకంగా రూ. 25 లక్షల కోట్లు పెరిగింది. మరి గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లో బెస్ట్, వరస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

గత ఏడాది కాలంలో నిఫ్టీలో ఐటీసీ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. షేరు విలువ 45.58 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించింది. హోటల్ బిజినెస్ విభజన, సిగరెట్, ఎఫ్ఎంసీజీ, పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ వ్యాపారాల్లో రాణించడంతో ఐటీసీ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించింది.

లార్సెన్ అండ్ టర్బో

ఇంజినీరింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) షేరు విలువ గత ఏడాది కాలంలో 44.05 శాతం పెరిగింది. ఆర్డర్లు బాగుండటంతో బలీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు విలువ గత పంద్రాగస్టు నుంచి ఇప్పటివరకు 36.67 శాతం పెరిగింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఒక్కో షేరు విలువ రూ. 5,812 గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 96,921 కోట్లుగా ఉంది. ఇటీవల వెల్లడించిన క్యూ 1 ఫలితాల్లోనూ కంపెనీ మంచి లాభాలు నమోదు చేసింది.

ఎన్టీపీసీ

ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్టీపీసీ షేరు గత ఏడాది కాలంలో 34.38 శాతం వృద్ధి చెందింది.

ఇండస్ ఇండ్ బ్యాంక్

ఇండస్ ఇండ్ బ్యాంక్ గత ఏడాది కాలంలో 28.55 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 2,606 బ్రాంచీలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 250 – 300 బ్రాంచీలు ఓపెన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వరస్ట్ పెర్ఫామెన్స్..

యూపీఎల్

గత ఏడాది కాలంలో యూపీఎల్ షేర్లు 25.17 శాతం పడిపోయాయి. దీంతో వరస్ట్ పెర్ఫామెన్స్ స్టాక్ గా ఇది నిలిచింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాలు కూడా మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి.

అదానీ ఎంటర్ ప్రైజెస్

అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు గతేడాది కాలంలో 14.26 శాతం పడిపోయాయి. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం కంపెనీ షేర్లు కుప్పకూలి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి.

ఇన్ఫోసిస్

రెండో అతిపెద్ద దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ షేరు విలువ గత ఏడాది కాలంలో 12.58 శాతం తగ్గింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన క్యూ1 ఫలితాలు కూడా బలహీనంగా ఉన్నాయి.

ఏషియన్ పెయింట్స్

ఏషియన్ పెయింట్స్ షేర్లు గతేడాది కాలంలో 6.57 శాతం క్షీణించాయి.

Related posts

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

హైదరాబాద్ – విజయవాడ హైవేపై మున్నేరు వరద.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు

HJNEWS

విశాఖలో తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య.. ఊరు వదిలేసొచ్చినా వదల్లేదు!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్