Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

‘తెర వెనుక ఉంది చిరంజీవే.. భార్యల బంగారం అమ్ముకున్నారు’

117 Views

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వీడినప్పటికీ.. ఆయన్ను రాజకీయాలు వదలడం లేదు. చిరంజీవి రూ.5 వేల కోట్లు తీసుకొని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని.. ఆయన రూ.1500 కోట్లకు టికెట్లు అమ్ముకున్నారని పాల్ ఆరోపించారు. జనసేనలో తెర వెనుక చిరంజీవి ఉన్నారని కేఏ పాల్ ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి జగన్ మినహా దాదాపుగా మిగతా నేతలంతా చిరంజీవి వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అయ్యారు. రాజకీయాల నుంచి రిటైరైన ఉండవల్లి లాంటి వాళ్లు మెగాస్టార్‌కు సపోర్ట్‌గా మాట్లాడారు. కానీ తెలుగునాట అతిపెద్ద రాజకీయ నేతగా తనను తాను భావించే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం చిరంజీవిపై సంచలన ఆరోపణలు చేశారు. మెగాస్టార్‌ను టార్గెట్‌గా చేసుకొని పాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తాను జనసేనలో చేరతానని చిరంజీవి లీక్స్ ఇస్తున్నాడని కేఏ పాల్ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తారని.. వీళ్లు హస్తం పార్టీ ఏజెంట్లని 2008లోనే తాను చెప్పానని పాల్ తెలిపారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి చిరంజీవి రూ.5 వేల కోట్లు తీసుకున్నారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని పాల్.. ప్రజారాజ్యం పార్టీ తరఫున టికెట్లు ఇవ్వడానికి రూ.1500 కోట్లు వసూలు చేశారన్నారు. ప్రజారాజ్యం పార్టీ టికెట్ల కోసం అప్పట్లో కాపులు భార్యల బంగారం అమ్ముకున్నారని పాల్ వ్యాఖ్యానించారు. బుద్ధున్న వాళ్లెవరైనా జనసేనలో ఉంటారా అని పాల్ ప్రశ్నించారు.

జనసేనలో తెర వెనుక చిరంజీవి ఉన్నారన్న పాల్.. ఆయన ఎంతో మంచోడిలా నటిస్తారని కానీ లోపలంతా కుతంత్రమేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను గానీ, చిరంజీవిని గానీ పోటీ చేయమనండి.. నేను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తాను… ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ పాల్ సవాల్ విసిరారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లను నమ్మొద్దన్న పాల్.. పవన్ చేసేది వారాహి యాత్ర కాదు బీజేపీ యాత్ర అన్నారు. చిరంజీవికి అప్పట్లో 18 శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్‌కు 6% మాత్రమే ఓట్లు వచ్చాయన్నారు.

ఐటీ దాడులు, ఈడీ రైడ్‌లకు భయపడటం వల్లే చిరంజీవి బీజేపీకి సరెండర్ అవుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సైతం తనకొచ్చి ప్యాకేజీ డబ్బుల విషయంలో ఐటీ దాడులకు భయపడి బీజేపీకి దగ్గరువుతున్నారంటూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా వీటికి భయపడే బిజేపీలో చేరారన్నారు.

రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని మోదీని, ఎన్డీయేని గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరడం ఎంత వరకు సమంజసమని పాల్ ప్రశ్నించారు. మోదీని గెలిపించాలంటున్న పవన్, చిరంజీవిలకు బుద్ధి ఉందా..? సిగ్గు ఉందా? అంటూ పాల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్న మోదీని సమర్థిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఆదరించొద్దని పాల్ ప్రజలను కోరారు. ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ లాంటి వ్యక్తులు యాంకర్లుగా మిగిలిపోవద్దని పాల్ హితవు పలికారు.

Related posts

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

ఏపీలో మరో వందేభారత్ రైలు?.. తిరుమల వెళ్లే భక్తుల కోసం!

HJNEWS

ఏపీలో అహా క్యాంటీన్లు.. ప్రభుత్వం కొత్త స్కీమ్.. భోజనం ఎంతంటే..!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్